ఛత్తీస్గఢ్కు చెందిన మాజీ రాజ్యసభ ఎంపీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు నంద్ కుమార్ సాయి ఆదివారం పార్టీని వీడారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు సాయి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీలో ప్రముఖ గిరిజన ముఖమైన సాయి పలు కీలక పదవులు చేపట్టారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ మాజీ ఛైర్మన్గా పనిచేశారు. 2003-2005 మధ్య ఛత్తీస్గఢ్ బీజేపీ చీఫ్గా ఉన్నారు. అతను 1997-2000 మధ్యప్రదేశ్ (అవిభక్త) రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు నెలరోజుల ముందు సాయి రాజీనామా చేయడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa