ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. మాల్దీవుల నుంచి కర్ణాటక మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు, పిడుగులు పడతాయని చెబుతున్నారు. ప్రజలు చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే రైతులు పొలం పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
శనివారం ఉత్తరాంధ్ర, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది విపత్తు నిర్వహణ సంస్థ. ఆదివారం, సోమవారాల్లో రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది అన్నారు. మంగళవారం రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పలుచోట్ల ఉరుములు మెరుపుల వర్షంతో కూడి పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. చెట్ల కింద ఉండరాదని.. రైతులు, కూలీలు, గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
10 రోజులుగా ఏపీలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.. అప్పటి వరకు ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షాలు ఉపశమనాన్ని ఇచ్చాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లగా మారిపోయింది.. ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం నష్టం చేశాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలతో రైతులు పంట నష్టపోయారు. ఈదురుగాలుల దెబ్బకు అరటి, మామిడి, నిమ్మ వంటి పంటలు నష్టం వాటిల్లింది. అక్కడక్కడా పంటలు నీట మునగడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే మరోసారి వర్ష సూచనతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటు తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈదురుగాలులతో పాటూ వడగళ్ల వానలు పడతాయంటున్నారు. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలంగాణ జిల్లాలతో పాటూ హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశ ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇటీవల కురిసన వర్షాలకు రైతులు నష్టపోయారు.. పంటలు నష్టపోవడంతో పాటూ ధాన్యం తడిచిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోసారి వర్ష సూచనతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa