కడప జిల్లాలో కుతూరు ఇంటర్ ఫెయిల్ అయిందని తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పట్టణంలోని ఏఎన్నార్ నగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఇంటర్ ఫలితాలు ప్రకటించింది. ఏఎన్నార్ నగర్కు చెందిన గౌతమి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది. అయితే ఓ సబ్జెట్లో గౌతమి ఫెయిల్ అయింది. దీంతో ఆమె తండ్రి మందలించాడు. మనస్థాపం చెందిన గౌతమి ఇంటి నుంచి వెళ్లిపోయింది.
కూతురు ఇంటి నుంచి వెళ్లిపోవటాన్ని జీర్ణించుకోలేని తల్లి ఆదిలక్ష్మీ తాను ఇక బ్రతికుండి వ్యర్థమని భావించింది. పట్టణ శివారులోని ఓ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కూతరు ఇంటర్ రిజల్స్ తల్లి ప్రాణం మీదకు వచ్చాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
ఇక బుధవారం (ఏఫ్రిల్ 26న) వెల్లడైన ఏపీ ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పరీక్షల్లో ఫెయిల్ కావటం, తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో రాష్ట్రవ్యాప్తంగా 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా.. మొత్తం 10,03,990 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్లో 61 శాతం, సెకండ్ ఇయర్లో 72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన వారిలో కొందరు విద్యార్థులు తీవ్ర మనస్థాపం చెంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa