యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు శివారు సబ్ స్టేషన్ ప్రాంతంలో వలస కూలీలతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడారు. పిల్లలతో సహా గుంటూరు జిల్లాకి పనుల కోసం వెళ్లి తిరిగి వస్తున్న కోసిగికి చెందిన వలస కూలీలతో కాసేపు ముచ్చటించారు. గుంటూరు జిల్లా వెళ్లి మిర్చి పనులు చేసుకొని తిరిగి వస్తున్నామని.. సాగునీరు లేక స్థానికంగా వ్యవసాయ పనులు దొరకడం లేదని వలస కూలీలు నారా లోకేష్ వద్ద వాపోయారు. అందుకే ఇతర ప్రాంతాలకు పిల్లలతో సహా వెళ్లి పనులు చేసుకొని తిరిగి సొంత ఊళ్లకు వస్తున్నామన్నారు. గుంటూరు వెళ్లి పనిచేస్తే రోజుకి రూ.350 కూలి వస్తుందని.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో బతకడం కష్టంగా మారిందన్నారు. వలస కష్టాలు లేకుండా చూడాలని లోకేష్ని వలస కూలీలు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa