‘‘స్వతంత్ర పార్టీగా ఉన్న జనసేన మాకు మిత్రపక్షంగా ఉంది. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో జరిపిన చర్చలు ప్రజాస్వామ్యంలో తప్పు కాదు అని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... తిరోగమనంలో నడుస్తున్న రాష్ట్రాన్ని పురోగమనంలోకి తీసుకురావడంపై జనసేన, బీజేపీ చర్చిస్తున్నాయి. ఈ అంశాలపైనే పవన్, బాబు మధ్య చర్చలు జరిగి ఉండొచ్చు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో పవన్ మాట్లాడారు. వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కలిగితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని జనసేన, బీజేపీ భావిస్తున్నాయి. ప్రభుత్వంపై చార్జిషీటు దాఖలు చేయడానికి 11 మంది సభ్యుల మొదటి సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది. శిశుపాలుడి నేరాల లెక్కింపు క్రమంలో ఈ చార్జిషీటు కమిటీ ఏర్పడింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్ నమ్మకద్రోహం చేశారు. అవినీతి, అరాచక వైసీపీని రాష్ట్రం నుంచి పారదోలాలి’’ అని సత్యకుమార్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa