ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే18న విజయనగరం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 11:49 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శృంగవరపుకోట నియోజకవర్గ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగినట్లు పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మే 17కు బదులు మే18న ‘ఇదేంఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ మార్పును నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు గమనించాలని కోరారు. మే 17న విశాఖ జిల్లా పెందూర్తి నియోజకవర్గంలో పర్యటించనుండడంతో ఒక రోజు వెనక్కి షెడ్యూల్‌ మారినట్లు వివరించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు, టీడీపీ అభిమానులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa