ఆర్ధిక నేరగాళ్లకు ఊడిగం చేస్తున్న మోదీని గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య తెలిపా రు. ఆదివారం రైల్వేకోడూరులో ప్రచార భేరి ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భారతదేశంలో ఆర్ధిక మోసగాళ్లకు, ఆర్ధిక నేరస్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. అర్ధాకలితో అలమటిస్తున్న కోట్లాది కుటుంబాల కడుపు నింపడానికి చర్యలు తీసుకోవడానికి బదులు ఆహార సబ్సిడీని భారీగా కుదించిందన్నారు. వ్యవసాయం నుంచి విద్య, వైద్యం అనేక రంగాలకు కేటాయింపులు అరకొరగా చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలం లో సైతం గ్రామీణులను ఆదుకున్న ఉపాధి హామీ పథకంపై బీజేపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో దాడి చేస్తోందన్నారు. పేదలకు దక్కవలసిన సబ్సిడీలో భారీ కోతలు విధించి కార్పొరేట్ ఆర్ధిక నేరగాళ్లను పెంచి పోషిస్తున్నా రన్నారని ఆరోపించారు. జిల్లా సీఐటీ యూ అధ్యక్షుడు సీహెచ్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ మోదీ ప్రభు త్వాన్ని దింపే వరకు ప్రజా పోరాటా లు ఆగవన్నారు. బీజేపీ, వైసీపీ దొందూదొందే అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రాధాకృష్ణయ్య, సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు, బీకేఎంయూ, ఏఐటీయూసీ, ఏఐఎస్ఎఫ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa