ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు సీఎం కావాలో ప్రజలే నిర్ణయిస్తారు... ఏక్ నాథ్ షిండే వ్యాఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 01, 2023, 09:59 PM

ఎవరు ముఖ్యమంత్రి కావాలో ప్రజలే నిర్ణయిస్తారని మ‍హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. కేవలం పోస్టర్లు పెట్టడం ద్వారా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని వ్యాఖ్యానించారు. తాము ప్రజల సేవకులం అని వివరించారు. విపక్షంలో సీఎం పదవి కోసం పోటీ మొదలైందని.. తమను తట్టుకోవడం వారివల్ల కాదని ఏక్ నాథ్ సెటైర్లు వేశారు. ఇదిలావుంటే మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. 


ప్రస్తుతం మహా వికాస్ అఘాడి (ఎంవిఎ), ఎన్సీపీకీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందని.. ఇస్లాంపూర్ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ ఇటీవల వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎన్సీపీ నేతనే అవుతారని చెప్పారు. దీన్ని ఇప్పుడు దాదాపు అందరూ అంగీకరించారని.. ఇటు ఎన్సీపీ వేగంగా దూసుకుపోతోందన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వంలో.. భవిష్యత్తులో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


మరోవైపు అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారని చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయంలో.. జయంత్ పాటిల్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు అజిత్ పవార్ మద్దతుదారులు అనేక ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అజిత్ పవార్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీని వీడనున్నారనే ఊహాగానాలను అజిత్ పవార్ తోసిపుచ్చారు. శరద్ పవార్ నాయకత్వంలో పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారని వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa