బీజేపీతో పెళ్లి, టీడీపీతో కాపురం చేసే వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఏపీ మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. పవన్ కల్యాణ్ సన్నాసి అయితే జనసేనను టీడీపీలో కలిపేయాలని సూచించారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని, పవన్ కు చేతనైతే 175 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను బరిలో దించాలని జోగి రమేశ్ సవాల్ విసిరారు. అమాయకులు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ పవనేమో చంద్రబాబు సీఎం అంటున్నాడని వివరించారు. పవన్ టీడీపీకి అమ్ముడుపోతాడని, అందరినీ చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేస్తాడని అన్నారు. జనసేన అభిమానులు కూడా జగనన్న బాటలోనే నడవాలని మంత్రి జోగి రమేశ్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa