ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి డెడ్‌బాడీని రోడ్డు పక్కన పడేశాడు,,,ఆలస్యంగా బయటపడిన ఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 03, 2023, 08:11 PM

మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు అన్నది ఇపుడు సత్యమవుతోంది. ఇదిలావుంటే కడప జిల్లాలో ఓ యువకుడు తన తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఘాట్‌ రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. దువ్వూరు మండలం సింగనపల్లెకు చెందిన చిన్నపుల్లారెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి. అతడు ఓ ప్రైవేటు స్కూల్ బస్‌ క్లీనర్‌‌గా పని చేస్తున్నాడు. అయితే చిన్న పుల్లారెడ్డి కొన్నేళ్లగా క్షయతో బాధపడుతున్నాడు.. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో రాజశేఖర్ రెడ్డి తండ్రిని ఫిబ్రవరిలో కడప సమీపంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించాడు.


ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బంది రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు.. అతడు మాత్రం స్పందించలేదు. తండ్రి పుల్లారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుమారుడికి చెప్పడంతో అదే నెల 23న రాజశేఖర్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య సిబ్బంది చిన్నపుల్లారెడ్డిని డిశ్ఛార్జి చేశారు.. అతడు ఆసుపత్రి దగ్గరే ప్రాణాలు కోల్పోయాడు. రాజశేఖర్ రెడ్డి తండ్రి మృతదేహానికి దుప్పటిని చుట్టి.. ఓ ఆటోలో తీసుకెళ్లి గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులో పొదల్లో పడేశాడు.. అక్కడిం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు.


గత నెల 29న ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో గాలిస్తే కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ దుప్పటిపై ఉన్న లోగో ఆస్పత్రిది కావడంతో పోలీసులు వెళ్లి ఆరా తీస్తే.. పుల్లారెడ్డి డెడ్‌బాడీగా తేలింది. తండ్రి అంత్యక్రియలకు డబ్బుల్లేకనే మృతదేహాన్ని పడేసినట్లు కుమారుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. తండ్రి మృతదేహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన రాజశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు పోలీసులు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa