మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్రెడ్డి నోరు విప్పితే ఇక అంతేనని, సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన అంతమవుతుందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక యువతను పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని రావడం సీఎం జగన్కు చేతకాకపోవడమే గాక, ఆయన పార్టీ నాయకుల వల్ల టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజానీకం ఎక్కడికక్కడ స్వాగతం పలుకుతున్నారని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నశించాలని, తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న మద్దతు జీర్ణించుకోలేక నారా లోకేష్ పాదయాత్ర భగ్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ తన బాబాయి హత్య జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నా దోషులను ఎందుకు శిక్షించలేదని ప్రశ్నించారు. సీబీఐ జగన్ చిన్నాన్న భాస్కర్రెడ్డి అరెస్టు చేసిందని, ఈ కేసులో అవినాష్రెడ్డిని కూడా విచారిస్తున్నదని అన్నారు. ఆవినాశ్రెడ్డి నోరు విప్పి నిజాలు చెబితే ఇక జగన్ పాలన ఖతం అయినట్లేనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa