ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 07:40 PM

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లువిశాఖ నగరంలో ఈ నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నందున, రోడ్ల పై, ఫుట్ పాత్ల పై ఆక్రమణలు, బ్యానర్లు లేకుండా చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులు, సెంటర్ మీడియన్లలో పిచ్చి మొక్కలను తీసివేసి అందంగా తీర్చిదిద్దాలని అధికారులను జివిఎంసి కమిషనర్ సి ఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. మంగళవారం ఆయన ప్రధాన ఇంజనీర్ రవికృష్ణ రాజు, అదనపు కమిషనర్లు డాక్టర్ వై. శ్రీనివాసరావు, డాక్టర్ వి. సన్యాసిరావు, చీఫ్ సిటీ ప్లానర్ బి సురేష్ కుమార్ లతో కలసి ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలను, రోడ్ల పరిశుభ్రతను పరిశీలించారు.


ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విశాఖ నగరంలో ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి పలు కార్యక్రమాలపై పర్యటించనున్నందున పి ఎం పాలెం క్రికెట్ స్టేడియం, ఆరిలోవ అపోలో హాస్పిటల్, బీచ్ రోడ్డు లోని సీ హ్యరియర్ మ్యూజియం, నేషనల్ హైవే రోడ్లు, ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనధికారికంగా ప్రదర్శించిన బ్యానర్లను తొలగించే ఏర్పాట్లను చేపట్టాలని సిసిపి కు ఆదేశించారు. రోడ్ల పై, రోడ్ల మధ్యలో గల సెంటర్ మీడియన్ లలో వ్యర్ధాలు లేకుండా పారిశుద్ధ్య పనులను నిత్యం పరిశీలించాలని అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావుకు, విద్యుత్ దీపాలను పరిశీలించాలని, జరుగుచున్న రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీర్ రవికృష్ణ రాజుకు కమిషనర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాలలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు పర్యటిస్తూ పరిశీలించాలని కమిషనర్ అధికారులకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa