ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ఐశ్వర్య సీఈవో అయ్యేది..,అంతలోనే అనంతలోకాలకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 10, 2023, 08:55 PM

టెక్సాస్‌ కాల్పుల్లో మరణించిన తెలంగాణ ఇంజినీర్ ఐశ్వర్య తాటికొండ గురించి.. ఆమె పని చేసే కంపెనీ బాస్ కీలక విషయాలు పంచుకున్నారు. 27 ఏళ్ల ఐశ్వర్యకు.. కంపెనీకి సీఈవో అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఆమెను త్వరలోనే సీఈవో చేయాలని ప్లాన్ చేశామని.. ఆమె పనిచేస్తున్న సంస్థ పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ LLC ప్రెసిడెంట్ శ్రీనివాస్ చలువాది ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. సివిల్ ఇంజినీర్‌గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఐశ్వర్య.. టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో నిర్మాణ సంస్థలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరింది. అయితే.. ఐశ్వర్య తన పనిలో సమర్ధవంతంగా పనిచేస్తుందనీ.. డల్లాస్‌లో ఇల్లు కొని స్థిరపడాలనే ఆలోచన కూడా ఐశ్వర్యకు ఉండేదని తెలిపారు.


"ఐశ్వర్యం నాకు కూతురు లాంటిది. మా ఆఫీసులోని ఆమె క్యాబిన్ వద్ద.. మా ఎంప్లాయిస్ సంతాపం వ్యక్తం చేయడానికి పుష్పగుచ్ఛాలు పంపుతున్నారు. ఐశ్వర్య క్యాబిన్‌లో శాశ్వత స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం." అని శ్రీనివాస్ తెలిపారు. అయితే.. మే 18న ఐశ్వర్య పుట్టినరోజు. దీంతో.. ఆమె పుట్టినరోజు పార్టీని గ్రాండ్‌గా చేయాలని కంపెనీ ప్లాన్ చేసింది. అయితే.. ఆ పార్టీ కోసం డ్రెస్ కొనేందుకే.. మే 6న ఐశ్వర్య అలెన్ మాల్‌కు వెళ్లింది. అయితే.. ఆమె వెళ్లిన మాల్‌లో ఒక్కసారిగా ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఐశ్వర్యకు బుల్లెట్లు తగలటంతో.. అక్కడికక్కడే మరణించింది. దీంతో.. ఆమె కన్న కలలన్ని ఆ రోజు ఆవిరైపోయాయి. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది మరణించగా.. మరో ఇద్దరు ఇండియాకు చెందినవారికి బుల్లెట్లు తగిలినట్టు తెలుస్తోంది.


అయితే.. షాపింగ్‌కు వెళ్లిన ఐశ్వర్య ఎంతకీ తన గదికి తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితులు ఆందోళన చెందారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. కాల్పులు జరిగిన రోడు ఐశ్వర్య కనిపించకపోయేసరికి.. ఆమె కోసం వివిధ ఆసుపత్రుల్లో వెతికమని తానాకు చెందిన అశోక్‌ కొల్లా తెలిపారు. చివరికి.. కొలిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయంలో విచారించగా.. ఆమె చనిపోయిన విషయం తెలిసిందన్నారు. ఐశ్వర్య కుటుంబం హైదరాబాద్‌లోని కొత్తపేటలో నివాసం ఉంటుంది. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్జి. మూడేళ్ల కిందట ఐశ్వర ఉన్నత చదువుల కోసం టెక్సాస్‌కు వెళ్లారు. మాల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన.. ఐశ్వర్య చికిత్స పొందుతూ మృతి చెందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa