ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు లేని ఇంట్లో బంగారం చోరీచేసిన దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 01:14 PM

కర్నూలు నగరంలోని నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాగేంద్ర నగర్‌లో రమణ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. రమణ స్థానికంగా ప్రైవేటు టీచర్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మానోపాడులో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగి సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూశాడు. ప్రధాన ద్వారం తలుపులు పగలకొట్టి ఉంది. బీరువాలో ఉన్న బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 9 తులాలు బంగారం, వెండి 5 తులాలు చోరీకి గురైనట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాగ్స్‌స్క్వాడ్‌, క్లూజ్‌ టీమ్‌లు వివరాలు సేకరించాయి. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకరయ్య తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa