వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న ‘గడపగడపకు’ కార్యక్రమంలో కొన్ని చోట్ల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి ఒక గ్రామంలోని ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో జరిగింది. ఇక్క డి వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. బాబుకు సోమవారం గ్రామస్థుల నుంచి పరాభవం ఎదురైంది. పూతలపట్టు మండలం లోని గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మగారిపల్లె గ్రామంలో రెండు ఇళ్లకు తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. అప్పటికే గ్రామ పెద్ద నరసింహనాయుడు ఎమ్మెల్యే వద్దకు వచ్చి, గెలిచి నాలుగేళ్లు అయినా రాలేదు, ఇప్పుడెందుకు వచ్చారని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదిలావుంటే ఎమ్మెల్యే వచ్చిన విషయం తెలుసుకుని గ్రామ ప్రజలు కనీసం ఆయనకు ముఖం కూడా చూపించకుండా ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్లిపోయారు. అభివృద్ధి చేయకుండా మా ఊరికి ఎందుకు వచ్చారని బందార్లపల్లెలోనూ గ్రామస్థులు ప్రశ్నించడంతో, ఆయన రెండు నిమిషాల్లోనే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa