ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2023, 01:16 PM

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో, కడప జిల్లా రైల్వే కొండాపురం మండల పరిధిలోని చిత్రావతి నది బ్రిడ్జి వద్ద సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో మొత్తం 15 మంది తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్నారు. లారీ డ్రైవర్‌ అజాగ్రత్త వలనే ప్రమాదం జరిగిందని సమాచారం.  తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం పూర్తిచేసుకుని  మరో అరగంటలో ఎవరి ఇళ్లకు వాళ్లం చేరుకుంటామనే సంతోషంతో కొందరు, నిద్రమత్తులో ఉండి మరికొందరు ప్రయాణిస్తున్నారు. ఇంతలోనే ఐరన్‌ ఓర్‌ లారీ రూపంలో మృ త్యువు ఎదురుగా దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టిన తీవ్రతకు వాహ నం పైభాగమంతా ఎగిరిపోయింది. వాహనంలో ఉన్నవాళ్లలో కొందరు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇంకొందరు వాహనంలో ఇరుక్కుపోయారు. వారందరి ఆర్తనాదాలు, అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయిం ది. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవరు సహా ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా కుటుంబసభ్యులు, బంధువులు. మృతుల్లో నలుగురు సొంత అక్కాచెల్లెళ్లు, వారి పిల్లలు ఉన్నారు. ఆ మార్గంలో పోతున్న వాహనదారులు, స్థానికులు.. వాహనంలో ఇరుక్కుపోయినవారినీ, తీవ్రగాయాలతో రోడ్డుపై విలవిలలాడిపోతున్నవారినీ తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa