అటవీశాఖ అనుమతులు లేక అసంపూర్తి పనులతో నిలిచిన ఉదయగిరి-బండగానిపల్లి ఘాట్రోడ్డును మంగళవారం నెల్లూరు జేసీ కూర్మనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, అటవీ, ఆర్అండ్బీ అధికారులతో కలిసి రోడ్డును పరిశీలించి రెవెన్యూ, అటవీ రికార్డులను తనిఖీ చేశారు. అలాగే బండగానిపల్లి ఘాట్, వెంకటాచలం మండలం వడ్లమూడి గ్రామ రోడ్ల నిర్మాణానికి కొండాయపాళెం రెవెన్యూ నేలటూరు గ్రామ సమీపంలో అటవీశాఖకు ప్రత్యామ్నాయంగా కేటాయించిన 1261, 1262 సర్వేనెంబర్లలోని 11.50 ఎకరాల భూమిని పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదికలు అందజేసి అటవీశాఖకు భూమిని బదలాయించి త్వరితగతిన రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకొంటామని అధికారులు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ సంపదను కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ ఎం. గంగాధర, రేంజ్ అధికారి తుమ్మల ఉమామహేశ్వరరెడ్డి, తహసీల్దారు సానా శ్రీనివాసులురెడ్డి, డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్ఎస్వో భోగ్యం శ్రీనివాసులు, ఏఈలు నరేష్, అనిల్రెడ్డి, సర్వేయరు రవి, నాయకులు మూలె సుబ్బారెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి, ఎఫ్బీవో వెంకటేశ్వర్లు, వీఆర్వో వెంకట్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa