కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ (సీపీఎం)ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముస్లింల కమ్యూనిస్ట్ పార్టీగా మార్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఏపీ అబ్దుల్లాకుట్టి సోమవారం ఆరోపించారు. బీజేపీ కన్నూర్ జిల్లా కమిటీ సమావేశంలో అబ్దుల్లాకుట్టి ప్రసంగిస్తూ.. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మహమ్మద్ రియాజ్ను తీసుకురావాలని పినరయి విజయన్ యోచిస్తున్నారని అన్నారు. ఈ ప్రణాళికతోనే పినరయి విజయన్ ఇస్లామిక్ ఉగ్రవాదులు, జిహాదీలతో అపవిత్ర పొత్తు పెట్టుకున్నారని బీజేపీ నేత ఆరోపించారు. గతంలో అవినీతి ద్వారా వచ్చిన డబ్బు పార్టీకి చేరేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పినరయి పార్టీ మారిందని, కమీషన్ అంతా పినరయి విజయన్ కుటుంబానికే దక్కుతుందని ఆరోపించారు.గత ఏడేళ్ల పినరయి విజయన్ ప్రభుత్వ పాలనలో కేరళ ప్రజల జీవితాలు దయనీయంగా మారాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa