ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీవీ సింధుకు ఏపీ డిప్యూటీ కలెక్టర్ పోస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 12:00 PM

ఒలింపిక్స్ లో పతకం సాధించడం ద్వారా తెలుగు ఖ్యాతిని చాటిన కుమారి పీవీ సింధుకు డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఇవ్వాలని నిర్ణయించినట్టు గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. ఈ ఉదయం వెలగపూడి అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విషయాన్ని ఆయన తెలిపారు. ఈ పోస్టును తీసుకునేందుకు ఆమె అంగీకరించారని తెలిపారు. సింధూ ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారని పొగిడారు. రాష్ట్రంలో క్రీడలకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు తన ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహాలను అందిస్తామని వెల్లడించారు. పాఠశాల స్థాయిలోనే క్రీడల్లో ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి, వారు మరింత రాటుదేలేలా శిక్షణను ఇప్పిస్తామని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa