ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్క్రాప్ బ్యాచ్ మహానాడు పెట్టుకున్నారు.... చంద్రబాబు, లోకేష్‌పై కొడాలి నాని ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 07:33 PM

స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని.. మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే.. గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు.


ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు.. ఇప్పుడు గతిలేక రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారమా ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో పెద్ద దెబ్బ తప్పదు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసు' అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.


'చంద్రబాబు, లోకేష్‌ను తరిమి కొట్టి.. ఎన్టీఆర్ వారసులు తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకుంటారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు కనిపించరు. 2019లో ప్రజలు తరిమేసినా.. మళ్లీ వచ్చి ఓట్లు అడుక్కుంటున్నారు. ఓట్ల కోసమే మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి' అని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa