దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ఐదో తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో భాస్కర్ రెడ్డిని నెల క్రితం సీబీఐ అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఇటీవల సీబీఐ కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 5వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇవాళ సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అనంతరం విచారణను ఈనెల 16వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది..
వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా నేడు సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. అనారోగ్య కారణలతో హాజరు కాలేకపోయారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక అప్రూవర్ దస్తగిరి కూడా నేడు సీబీఐ కోర్టులో విచారణకు కాలేదు. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతుండగా.. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందనేది హాట్టాపిక్గా మారింది. సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు లేవని, సాక్ష్యాల చెరిపివేతలో తనకు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తనను సీబీఐ అక్రమంగా అరెస్టు చేసి చేసిందని ఆరోస్తున్నారు. తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. కాగా ఏప్రిల్ 8న భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. పులివెందులలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి అనంతరం హైదరాబాద్కు తీసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa