రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంభాలకు ఏపీ అండగా నిలిచింది. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి(60) కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మరణించినవారితో పాటు గాయపడినవారికి కూడా పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది. బాలాసోర్లో గురుమూర్తి నివాసం ఉంటుండగా.. ఏపీలో పెన్షన్ తీసుకుని వెళుతుండగా.. రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు గుర్తించింది. రైలు ప్రమాద బాధితులకు అండగా నిలుస్తున్నామని, ఏపీకి చెందిన ప్రయాణికులను గుర్తిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఒడిశా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు కూడా ఉండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఏపీ ప్రయాణికులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఇక్కడ నుంచి అధికారులను ఒడిశాలో ప్రమాదం జరిగి ప్రాంతానికి పంపించింది. ప్రయాణికుల కుటుంబసభ్యుల కోసం ఏపీ ప్రభుత్వ వాట్సప్ నెంబర్ను తీసుకొచ్చింది. ట్రైన్ ప్రమాదంలో మీ కుటుంసభ్యులు మిస్ అయినట్లేతే 8333905022 వాట్సప్ నెంబర్ను సంప్రదించాలని కోరుతోంది. మీ కుటుంసభ్యులు ఎవరైనా ఒడిశాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్కు గురైనా లేదా మిస్ అయినా ఈ నెంబర్కు వారి ఫొటోతో పాటు వివరాలను పంపించాలని తెలిపింది. దీని వల్ల వారిని గుర్తించేందుకు సులువు అవుతుందని స్పష్టం చేసింది.
అలాగే 1070, 112, 18004250101 హెల్ప్ నెంబర్లను కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మీ కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. ఏపీ నుంచి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందం ఒడిశాలోని బాలాసోర్కు చేరుకుంది. ఏపీకి చెందిన ప్రయాణికులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు 11 మంది ఆచూకీ లభించలేదని మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఆన్రిజర్వ్డ్ బోగీల్లో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి మృతి చెందాడని అమర్నాథ్ వెల్లడించారు. మిస్సింగ్ అయినవారి కోసం వెతుకులాట మొదలుపెడుతున్నామని, రాష్ట్రానికి చెందిన బాధితుల కోసం బాలాసోర్లో 16 అంబులెన్స్లు, భువనేశ్వర్లో 10, బాలాసోర్లో ఐదు మహాప్రస్థాన వాహనాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఏపీకి చెందిన క్షతగాత్రుల్లో కొంతమందిని భువనేశ్వర్లోని అపోలో హాస్పిటల్కు, మరికొంతమందిని విశాఖలోని సెవెన్ హిల్స్, అపోలో ఆసుపత్రలుకు అంబులెన్స్లలో తరలించినట్లు అమర్నాథ్ తెలిపారు. 11 మందికి చికిత్స అందించి పంపించామని, గుర్తించాల్సిన మృతదేహాలు ఇంకా చాలా ఉన్నాయిన చెప్పారు. అన్ని విధాలుగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాగా ఒడిశా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. బంధువులు మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa