భవిష్యత్తులో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చేకూర్చే గ్యారెంటీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిందనిమాడుగుల తెలుగుదేశం పార్టీ నాయకులు వైలె ప్రసాదరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం మేనిఫెస్టో “భవిష్యత్ కు గ్యారంటీ”పై నియోజకవర్గ చర్చా కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జి పీవీజీ కుమార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలా ప్రసాదరావు మాట్లాడుతూ చంద్రబాబు అనుభవం, ముందుచూపుతో ప్రకటించిన మేనిఫెస్టో అంశాలను ప్రతీ కార్యకర్తా గ్రామాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. మహిళల కోసం మహాశక్తి , రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువగళం, బిసిల కోసం రక్షణ చట్టం వంటి కీలక పథకాలను ప్రకటించారని ఇవి ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఈ అంశాలను సోషల్ మీడియాతో పాటు గ్రామాల్లో కరపత్రాలు, బేనర్లు ద్వారా ఇంకా నేరుగా మహిళలు, యువతకు చేరువయ్యే రీతిన వివరిస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. ఈ ఎన్నికల ప్రణాళిక భవిష్యత్తులో రాష్ట్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తీర్చగలదని చెబుతూ కార్యకర్తలు వీటిపై విస్తృత ప్రచారం చేపట్టాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa