కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమిని కుక్క చావుగా అభివర్ణించిన పేర్ని నాని.. 2014ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పుడు వచ్చిన చావేంటో చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ డిమాండ్ చేశారు. విశాఖ ఎంపీ స్థానంలో బీజేపీ కార్యకర్త చేతిలో వైఎస్ విజయలక్ష్మి ఓడిపోయిన తీరును ఏమంటారో కూడా చెప్పాలన్నారు. విశాఖ సభలో సత్యకుమార్ మాట్లాడుతూ.. వైసీపీ పాలనతో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. కర్ణాటకలో బీజేపీది కుక్కచావు అయితే... కడపలో వార్డు మెంబర్గా ఓడిన రాజారెడ్డిది, రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినప్పుడు దక్కిన ఘోర పరాభవాన్ని ఏమంటారో కూడా పేర్ని నాని చెప్పాలన్నారు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన అంత మిడిసిపాటు తగదని హితవు పలికారు.
![]() |
![]() |