ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 12, 2023, 02:23 PM

గత పాలకులు అమరావతి నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయలేకపోయారని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు. నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం సందర్భంగా క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావు మాట్లాడుతూ.... రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు–నేడు ద్వారా మా నియోజకవర్గానికి సుమారు రూ.257 కోట్లు వైయస్‌ జగన్‌ ద్వారా మాకు అందాయి. గత ప్రభుత్వాలు ఇందులో కనీసం నాలుగో వంతు కూడా ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలి.


విద్య తరువాత, వైద్యానికి కూడా పెద్ద పీట వేశారు. వైద్యం కింద మా నియోజకవర్గానికి రూ.24 కోట్లు ఇచ్చారు. మూడు పీహెచ్‌సీలు కొత్తగా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలో ఎన్నో దశాబ్ధాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న అమరావతి–బెల్లంకొండ రోడ్డు కలను వైయస్‌ జగన్‌ సాకారం చేశారు. 33 అడుగుల రోడ్డును వైయస్‌ జగన్‌ మంజూరు చేశారు. ఇందుకు రూ.150 కోట్లు విడుదల చేశారు. ఈ రోడ్డు కృష్ణమ్మ తల్లికి మణిహారం. మా నియోజకవర్గానికి ఈ రోడ్డును గిప్టుగా ఇచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు మరోక్కసారి ధన్యవాదాలు అని తెలియజేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa