జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ఎటువంటి అవరోధాలు కలగకుండా ఉండేందుకు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించామని జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ అన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలోని సీతారామస్వామి గ్రూపు దేవాలయాల్లో సురేష్ తో పాటు జనసైనికులు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతంగా జరగాలని కోరారు. కార్యక్రమంలో గజపతినగరం పంచాయతీ నాలుగో వార్డు సభ్యుడు కలిగి పండు, జనసైనికులు బూర్లి రాము, కడమల శ్రీను, హేమ సుందర్, పైల మహేష్, లెంక గణేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa