బిహార్లో ఘోరం చోటు చేసుకొంది. కొత్త బైక్ కొన్న ఆనందం ఆ బాలుడికి కొద్దిసేపు కూడా నిలవ లేదు. ఎంతో సంతోషంతో బైక్కు పూజ నిర్వహించేందుకు నది ఒడ్డుకు చేరారు. బైక్కు నదీ జలం చల్లేందుకు.. వెళ్లిన ఆ బాలుడు నదిలోకి దిగాడు. నదిలో కాచుకు కూర్చున్న మొసలి.. ఒక్కసారిగా బాలుడ్ని నోట కరచుకుని నీటిలోకి వెళ్లిపోయింది. అది గమనించిన బంధువులు.. నదిలో గాలింపు చేపట్టారు. గంటసేపటి తర్వాత మొసలిని బయటికి తీయగా.. బాలుడ్ని అప్పటికే అది చంపి తినేసింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో స్థానికులతో కలిసి బాలుడి బంధువులు మొసలిని కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. బాలుడి మృతితో ఆ కుటుంబం తీవ్ర్ విషాదంలోకి వెళ్లింది.
బిహార్లోని వైశాలి జిల్లా రాఘోపూర్ దియారా గ్రామానికి చెందిన 14 ఏళ్ల అంకిత్ కుమార్ 5 వ తరగతి చదువుతున్నాడు. అంకిత్ కుమార్ తండ్రి కొత్త బైక్ కొన్నాడు. దీంతో దానికి పూజ చేయించేందుకు గంగానది ఒడ్డుకు తీసుకువెళ్లారు. కొత్త బైక్కు పూజ చేసేందుకు.. అంకిత్ గంగానదిలో స్నానం చేసి గంగాజలం తీసుకురావడానికి నీటిలో దిగాడు. దీంతో ఒక్కసారిగా మొసలి దాడి చేసింది.
అంకిత్పై దాడి చేసిన మొసలి.. నోటితో కరచుకొని నీటిలోకి లాక్కెళ్లింది. ఇది గమనించిన అంకిత్ కుటుంబ సభ్యులు వెంటనే నది వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆ మొసలి అంకిత్ను బతికి ఉండగానే.. ముక్కలు ముక్కలుగా కొరికి.. తినేసింది. దీంతో ఆ ప్రాంతంలో అంకిత్ రక్తంతో నీరు అంతా ఎర్రగా మారింది. తమ మనవడిని మొసలి అత్యంత క్రూరంగా చంపి తినేసిందని.. అంకిత్ తాత సకల్దీప్ దాస్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న అంకిత్ కళ్ల ముందే.. చనిపోవడంతో బంధువులతోపాటు గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అంకిత్ను మొసలి చంపి తిన్న విషయం తెలుసుకుని స్థానికులు నదీ తీరం వద్దకు భారీగా చేరుకున్నారు. దాదాపు గంట పాటు గాలింపు చేపట్టి.. చివరకు మొసలిని బంధించి ఒడ్డుకు తీసుకువచ్చారు. అంకిత్ను చంపి తిన్నందుకు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన.. అతని బంధువులు, స్థానిక ప్రజలు మొసలిపై దాడి చేశారు. కర్రలు, రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. చివరకు మొసలి చనిపోయే వరకు కొట్టి చంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa