నాకు ఇష్టమైన రెండు చెప్పులను ఎవరో దొంగిలించారు..మీకు కనిపిస్తే పట్టుకోండి.. నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్.. అంటూ మాజీ మంత్రి పేర్నినానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ....వైసీపీ ప్రభుత్వం ఎంతలా దిగజారిపోయిందంటే అన్నవనం సత్యనారాయణస్వామి గుడిలో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఇటీవల పెర్నినాని రెండు చెప్పులు చూపి చేసిన వాఖ్యలను ఉద్దేశించి పవన్ ఇలా చురకలంటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa