కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదిఇలా ఉంటే. తమిళనాడులో సినిమాల్లోనే కాకుండా యూత్ లో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. 60కి పైగా చిత్రాలు చేసినా.. ఎన్నో సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న విజయ్ లక్షలాది మంది అబిమానులను సంపాదించుకున్నారు. సామాజిక, రాజకీయ సందేశాలు ఇచ్చే సినిమాలు చేయడంలో ఆయన ముందుంటారు. సమాజం పట్ల బాధ్యత ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ రాజకీయాలపై అప్పుడప్పుడు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా స్పందిస్తుంటారు. తాజాగా పదో తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్పులు తెచ్చుకున్న వారిని చెన్నైలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు.
నేటి విద్యార్థులే రేపటి ఓటర్లు అని, విద్యార్థులంతా ఇంటికి వెళ్ళాక డబ్బు తీసుకోకుండా ఓట్లు వేయాలని తల్లిదండ్రులకు చెప్పాలని సూచించారు. డబ్బు తీసుకుని ఓటు వేసే పద్ధతిని మార్చాలని పిలుపునిచ్చారు. డబ్బు తీసుకుని ఓటు వేస్తె మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ఆయన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఇందుకోసం సొంతంగా పార్టీగా కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసే సినిమానే ఆయనకు ఆఖరుదని తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa