ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను నా లాగే ఉండనివ్వండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 10:49 AM

 పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం తంగెడలో రచ్చబండ - ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో టీడీపీ నాయకులు యరపతినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగేళ్లలో పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులను యరపతినేని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరచరిత్ర కలిగిన జగన్‌కు పాలించే అర్హత లేదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం అరాచకాలు చేయడానికి కాదని తెలిపారు. తప్పుడు కేసులు పెట్టే పోలీసులపై అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయని.. తప్పులు చేస్తున్న వైసీపీ నాయకులు, పోలీసులపై చర్యలు తప్పవని తెలిపారు. హత్యా రాజకీయాలు చేసినవారిని వదలమన్నారు. ‘‘నేను మారిన శ్రీనుని.. మంచికళ్ళు శ్రీనుని కాదు... నన్ను మళ్లీ మంచికళ్ళు శ్రీనుని చేయ్యొద్దు.. వైసీపీ నాయకుల ధన దాహానికి గురజాలలో 8 మంది చిన్నారులు బలయ్యారు. వైసీపీ నాయకులు అక్రమంగా తవ్విన క్వారీ గుంతల్లో పడి చిన్నారులు చనిపోయారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. బాబాయి హత్య కేసులో ఎవరూ తప్పించుకోలేరు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు’’ అంటూ యరపతినేని శ్రీనివాస్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa