శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. టెక్కలి మండలం నౌపడ- టెక్కలి ఆర్అండ్బీ రహదారిపై ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర గేటు వేయకుండానే విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు హారన్ పెద్దగా మోగిస్తూ వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన గూడ్స్ డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. రైలును వెంటనే గమనించిన స్థానికులు పరుగులు తీశారు. రైలు గేటు వైపు రావడంతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
రైలు శబ్దానికి గేట్మాన్ తేరుకున్నారు.. వెంటనే అప్రమత్తమై గేటు వేసి పచ్చజెండా ఊపాడు. గేటు ఎందుకు వేయలేదంటూ గేట్ మాన్ను గూడ్స్ రైలు లోకో పైలట్లు ప్రశ్నించారు. తనకు సమాచారం రాలేదని గేట్ మాన్ చెప్పడం విశేషం. ఆ తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లింది.. గూడ్స్ డ్రైవర్ గుర్తించకపోతే పెనుప్రమాదం జరిగి ఉండేదని వాహనదారులు చెబుతున్నారు. ఈ ఘటనతో రైల్వే సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకో పైలట్ అప్రమత్తత, స్థానికులు గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa