మార్గదర్శ సంస్థపట్ల ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్.తులసిరెడ్డి మండిపడ్డారు. మార్గదర్శి సంస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇది దారుణమని తులసిరెడ్డి బుధవారం విమర్శలు గుప్పించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... ప్రభుత్వం చేసే తప్పులను మీడియాలో ఎత్తిచూపితే మార్గదర్శిని వేధించడం జగన్ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనం అన్నారు. మార్గదర్శి వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని, ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లోనే సమస్య ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు.
మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు లేదని, అయినా ప్రభుత్వానికి ఇంత అత్యుత్సాహం ఎందుకో చెప్పాలని నిలదీశారు. ఆవు, దూడ బాగా ఉన్నప్పటికీ, మధ్యలో గుంజకు వచ్చింది గురకరోగమని ఓ సామెత ఉందని, అలా ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లకు లేని సమస్య ప్రభుత్వానికి ఎందుకో చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వం తీరు వల్ల ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు పెంచవలసింది పోయి వివిధ సంస్థలను వేధిస్తూ.. వాటిని రాష్ట్రం నుండి వెళ్లగొట్టి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నాడన్నారు. రాష్ట్రానికి జగన్ తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. సీఐడీ అధికారులు కూడా రాజకీయ నాయకుల మాదిరి మాట్లాడటం సరికాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa