హాయ్ ఏపీ.. బైబై బీపీ అనే నినాదాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు అందుకుంటారని మంత్రి రోజా తెలిపారు. జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు లేదు.. జిల్లా అధ్యక్షులు లేరు.. 175 స్థానాల్లో అభ్యర్థులు లేరు.. అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తరిమేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇదిలావుంటే ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’’ అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపును మంత్రి రోజా పై విధంగా తిప్పికొట్టారు.
ఇక చంద్రబాబు నాయుడును మరోసారి నమ్మే పరిస్థితిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని మంత్రి రోజా అన్నారు. టీడీపీ నాయకత్వం నినాదాల నుంచి మేనిఫెస్టో వరకు అంతా కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. బుర్ర పెట్టి కొత్తగా ఆలోచించే సత్తా కూడా వీరికి లేదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తన మేనిఫెస్టోని పక్కన పెట్టేశారని ఆరోపించారు. ఇదే సమయంలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఏపీ ప్రజలు బాగున్నారని.. చంద్రబాబును మళ్లీ కొనితెచ్చుకుంటారా? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
ఇక, పవన్ కళ్యాణ్ ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని అంటారని.. మరొక రోజు ఎమ్మెల్యే కావాలి అంటారని.. ఇప్పుడేమో అసలు గెలవలేను అంటున్నారని మంత్రి రోజా సెటైర్లు వేశారు. పార్టీ పెట్టిన వ్యక్తికి ప్రజలకు ఏమి చేస్తారో క్లారిటీ ఉండాలని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏమి చేస్తాడో చెప్పకుండా తమపై చీప్గా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తమను కొడతానని చెప్పాడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారా అని ప్రశ్నించారు.
తనకు ఓట్లు వేసే వారే మీటింగ్కు రావాలని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. అన్నీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాదని పవన్కి ఎందుకు ఓట్లు వేయాలని మంత్రి రోజా నిలదీశారు. మీరు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా తమకు భయం లేదన్నారు. ఇక, తనకు ఆరోగ్య సమస్య వస్తే జనసేన సైకోలు అనవసరంగా కామెంట్స్ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెవిల్ ఈజ్ బ్యాక్.. మీ అంతు తేలుస్తా అంటూ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa