ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయాలు కాస్త వేడెక్కుతున్నాయి. ఇదిలావుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్పై పవన్ వ్యాఖ్యలు.. ఆ వెంనటే ముద్రగడ పద్మనాభం లేఖలు చకచకా జరిగాయి. పవన్కు మద్దతుగా మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య లేఖలు రాస్తున్నారు. తాజాగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు మరో లేఖ రాశారు.
జగన్పై ఈడీ, సీబీఐ విచారణ చేసి క్విడ్ప్రోకో కింద, మనీ ల్యాండరింగ్ కింద కేసులు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై విడుదల అయ్యారన్నారు. క్విడ్ప్రో కింది తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో వారి అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. ఇలా పారిశ్రామికవేత్తలు కొందరికి ఉపయోగపడటం ద్వారా వారికి లబ్ధి చేకూర్చారన్నారు. ఆ తర్వాత కొన్ని కంపెనీలలో పెట్టుబడులు పెట్టించి అక్రమ ఆన్తులు కూడగట్టటం ద్వారా కోట్లాది రూపాయిలు అక్రమంగా ఆర్జించారని సీబీఐ, ఈడీ అభియోగాలు మోపాయన్నారు.
జగన్పై బనాయించిన ఈ కేనులు ఇప్పటికీ సీబీఐ కోర్టులో విచారణ జరుగుతూ పెండింగుతో ఉన్నాయన్నారు. ఈ కేసులను త్వరగా పరిష్కరించాలని, సదరు అభియోగాలపై నిజానిజాలు తేల్చేలా సీబీఐ కోర్టుకు డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా హైకోర్టులో తాను పిల్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఏ కారణం చేతనైనా జగన్పై మోపబడిన అభియోగాలు, సాక్ష్యాలు ఉన్నాయంటూ కోర్టులు దోషిగా ప్రకటిస్తే పరిస్థితి ఏంటన్నారు.
గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితలా ఇప్పుడు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. జగన్ వారసులుగా వైఎస్సార్సీపీ తరఫున మరో రెడ్డి కులస్తుడ్ని ముఖ్యమంత్రి చేస్తారా.. లేని పక్షంలో బడుగు బలహీన వర్గాల బిడ్డగా అభివర్ణించుకుంటున్న జగన్.. కాపులు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీల నుంచి ఎవరినైనా ఎంపిక చేసి ముఖ్యమంత్రిగా చేస్తారా చెబితే అందరం నంతోషిన్తామన్నారు. తద్వారా బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న కమిట్మెంట్ను కూడా చూసి గర్వవడతామని.. ఈ విషయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియచేయాలని లేఖలో కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa