మంచంపై నోట్ల కట్టలతో తన భార్యా పిల్లలు దిగిన సెల్ఫీ పోలీసు అధికారి సహానీకి చుక్కలు చూపించింది. నెట్టింట్లో ఈ విషయం వైరల్ కాగా దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆ సొమ్ము మొత్తం రూ.14 లక్షలు అని తెలుస్తోంది. ఇంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చేందుకు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. సహానీ ఇది తన వారసత్వ ఆస్తి అని చెప్తున్నారు. ఈ ఘటన యూపీలో జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa