రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడం కోసమే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టినట్లు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పీలేరు నియోజకవర్గంలోని కలికిరి మండలం, కలికిరి టౌన్, ఇందిరమ్మ కాలనీల్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గాడి తప్పిన రాష్ట్ర ప్రగతిని తిరిగి సక్రమ మార్గంలో పెట్టే సత్తా, సామర్థ్యం ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని అన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని అందించి, మళ్లీ మనం నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa