ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 16, 2023, 01:08 PM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీస్ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ...  గుళ్ళపూడి గ్రామానికి చెందిన జూజిగం రంగారావు (38) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ నెల 14న ఉదయమే మద్యం తాగి వచ్చిన రంగారావుకు, భార్య సుధారాణికి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం భార్య కూలి పనులకు వెళ్ళి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి రాగా భర్త రంగారావు వాంతులు చేసుకుం టుండడం, పురుగుమందు వాసన రావడంతో వెంటనే ధర్మాజీగూడెం ప్రభుత్వా సుపత్రికి తీసుకువెళ్ళింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తున్న క్రమంలో గన్నవరం సమీపంలో మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి నూజివీడు ప్రభుత్వా సుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa