నంద్యాలలో ఘరానా మోసం బయటపడింది. జల్సాలకు అలవాటు పడిన యువకులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. సరికొత్త మోసంతో రూ.లక్షల్లో కాజేసి చివరికి పోలీసులకు చిక్కారు. నంద్యాల సాయిబాబానగర్కు చెందిన అన్సర్ హుసేన్ జల్సాలు, వ్యసనాలకు అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.. కార్లు అద్దెకు తీసుకుని వెళ్లి వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బులతో జల్సాలు చేసేవాడు.
అన్సర్ హుస్సేన్ నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో కలిపి మొత్తం 13 కార్లు అద్దెకు తీసుకుని, వాటిని తాకట్టు పెట్టాడు. దాదాపు రూ.23 లక్షల మేరకు డబ్బులు సంపాందించాడు. ఒకవేళ అనుమానంతో కారు ఇచ్చిన యజమాని అడిగితే, బాడుగకు పంపించానని చెప్పేవాడు. కారు రాగానే ఇస్తానని నమ్మించి పరారయ్యేవాడు. కారును తాకట్టు పెట్టి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మళ్లీ ఆ కారునే బాడుగకు తీసుకుని వారిని కూడా బోల్తా కొట్టించేవాడు.
నంద్యాల విశ్వనగర్ చెందిన చంద్ర భూపాల్ కారును కూడా ఇలాగే తీసుకొని తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ పర్యవేక్షణలో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్సర్ హుసేన్ను ఎస్బీఐ కాలనీలోని సింట్ టవర్స్ అపార్టుమెంట్ దగ్గర అరెస్ట్ చేశారు. అతడు తాకట్టు పెట్టిన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాదు నంద్యాల జిల్లా ఇదే తరహాలో మోసం చేస్తున్న యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మకూరు మండలం వెంకటాపురంనకు చెందిన సయ్యద్ జావీద్ బాషా అనే యువకుడూ ఇదే పద్ధతిలో కార్లు బాడుగకు తీసుకుని తాకట్టు పెట్టేవాడు. రూ.15 లక్షలు తీసుకుని జల్సాలు చేశాడు. కార్ల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. నందికొట్కూరు మార్కెట్ యార్డు దగ్గర జావీద్ను అరెస్టు చేశారు. అతడి దగ్గర నుంచి రూ.60 లక్షల విలువ చేసే 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకుని తమదేనంటూ నమ్మించి ఇతరుల దగ్గర తాకట్టు పెట్టేవాళ్లు.
రాష్ట్రంలో తక్కువ ధరకు రుచి, శుచితో కూడిన ఆహారాన్ని విక్రయించేలా వైసీపీ సర్కార్ ఆహా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో సుమారు 140 ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నందుకు మెప్మాను అభినందించారు మంత్రి రోజా. ఆహా క్యాంటీన్లకు ప్రభుత్వం రూ.13 వేల ఆర్థిక సహాయం చేయడం, వారికి రుణాలు సున్నా వడ్డీకే ఇప్పించి వాళ్ల వ్యాపార అభివృద్ధికి సహకరిస్తోంది అన్నారు. మహిళా మార్ట్లను కూడా రిలయన్స్, హెరిటేజ్, బిగ్ బజార్ వంటి కార్పొరేట్ సూపర్ మార్కెట్ లకు ధీటుగా జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీటి వలన వ్యాపారభివృద్ధి చెంది మహిళల ఆదాయం మరింత రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa