దళితుల పట్ల జగన్ వైఖరి తేటతెల్లమైందని మాజీ మంత్రి జవహర్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వరూప్ మోకాళ్లపై నిలబడి దళితుల ఆత్మగౌరవం పోగోట్టారని మండిపడ్డారు. దళితులు అమలాపురం వేదికగా అవమానించబడ్డారన్నారు.దళిత నాయకత్వం సైతం ద్వితీయ పౌరులుగా వుండటం మామూలేనని చెప్పారు.జగన్ దళితులకు గౌరవం ఇవ్వడని తేలిపోయిందన్నారు.మంత్రి నారాయణస్వామి పెద్దిరెడ్డి పాలేరు.. మంత్రి వేణుగోపాల్ వైవీ సుబ్బారెడ్డి పాలేరు అని ఎద్దేవ చేశారు. వైసీపీ నేతలకు జగన్ కాళ్లు మొక్కటం కనీస అర్హతగా వుందన్నారు.మీ పదవుల కోసం దళితులను అవమానిస్తూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.దళితులను చంపిన ఎమ్మెల్సీ జగన్ పక్కన కూర్చుంటారని ధ్వజమెత్తారు. దళిత మంత్రులు జగన్ ముందు నిలబడడం, మొకాళ్లపై వుండటం కొత్తకాదన్నారు.ఇప్పటికైనా దళితులు అర్ధం చేసుకుని జగన్కు దూరంగా ఉండాలని జవహర్ హితవు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa