ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వంపై జనసేనాని చేసేవి తప్పుడు ఆరోపణలు... మంత్రి విడదల రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 10:44 PM

ప్రభుత్వంపై జనసేనాని చేసేవి తప్పుడు ఆరోపణలు అని ఏపీ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. రుషికొండపై ఆయన చేస్తోన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే అంతా సాగుతోందన్నారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. అంతకుముందు మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణను బహిష్కరించిన వ్యక్తి ఇప్పుడు సీబీఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవాలని టీడీపీ అధినేత చూస్తున్నారన్నారు. ప్రధాని, రాష్ట్రపతిలకు చంద్రబాబు లేఖ రాశారని, కానీ ఎందుకు రాశారో తెలియదన్నారు. పుంగనూరు ఘటనలో పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఈ సంఘటనలో వైసీపీ నేతలు లేరన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జనసేనాని చదువుతున్నారని విమర్శించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa