టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అంగళ్లులో అధికారపార్టీ నాయకుల నిరసన దీక్షకు పోలీసుల అనుమతి ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. అధికారపార్టీకి చెందిన నాయకులు ప్రతిపక్షనేతకు వినతిపత్రం సమర్పించేందుకు ప్రయత్నించారని చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించింది. ఫిర్యాదుదారు, ఆయన అనుచరులు అక్కడికి ఎందుకు వెళ్లాల్సివచ్చింది.. అది రెచ్చగొట్టడం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో చోటుచేసుకున్న ఘటనలో ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిషోర్కుమార్ రెడ్డి, పులివర్తి నాని దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సోమవారం సమయాభావం కారణంగా వాదనలు కొనసాగింపు కోసం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చేయకుండా పోలీసులకు తగుసూచనలు చేయాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ను ఆదేశించించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్రెడ్డి సోమవారం ఆదేశాలిచ్చారు. అంతకుముందు.. దేవినేని ఉమ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ‘‘ప్రాజెక్టులను సందర్శించేందుకు పోలీసుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకున్నారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత పిటిషనర్ల పై ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa