ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో రుషికొండపై ఏపీటీడీసీకి 68 ఎకరాల భూమి ఉంది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఇచ్చిన అనుమతుల ప్రకారం అందులో 9.88 ఎకరాలను (అది కూడా పర్యాటకాభివృద్ధి కోసం) మాత్రమే ఉపయోగించుకోవాలి. అందులోనూ 4.5 ఎకరాల్లోనే భవనాలు నిర్మించాలి. మిగిలిన భూమిని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలి. కాగా 19,967.97 చ.మీ. విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతామని జీవీఎంసీకి ఏపీటీడీసీ ప్లాన్ సమర్పించింది. తొలి దశలో 4 బ్లాకులను 12,591 చ.మీ. విస్తీర్ణంలోనే నిర్మిస్తామని తెలిపింది. అయితే అక్కడ అంతకుమించి నిర్మాణాలు సాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే జీవీఎంసీ అడ్డుకోవాలి. అయితే ఈ పనులను పర్యవేక్షించే బాధ్యత జీవీఎంసీ అధికారులకే ప్రభుత్వం అప్పగించింది. పర్యాటకుల వసతి భవనాల పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నిర్మిస్తున్నారు. వారికి నచ్చినట్టు నిర్మించుకుంటూ పోతున్నారు. నిర్మాణాల వివరాలపై ప్రభుత్వం మొదట్నుంచీ గోప్యత పాటిస్తోంది. ఏ అధికారీ ఇక్కడి పనులను తనిఖీ చేయడం లేదు. అనుమతించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలోనే కొండ తవ్వకాలు జరిగాయని కమిటీ నిర్ధారించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa