విశాఖలో నలుగురు స్నేహితుల మధ్య మొదలైన చిన్న వివాదానికి ఓ నిండు ప్రాణం బలి అయ్యింది. అష్టా చమ్మా విషయంలో వాగ్వాదం జరిగి.. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. యువకుడి తల రోడ్డుకు తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. మద్దిలపాలెం కళాభారతి రోడ్డులోని కూరగాయల బజారు దగ్గర మంగళవారం సాయంత్రం నలుగురు స్నేహితులు కలిసి అష్టా చమ్మా ఆడుకుంటున్నారు. నలుగురూ మద్యం తాగి ఆ మత్తులో ఉన్నారు. నలుగురి మధ్య సరదాగా మొదలైన మాటలు.. మెల్లి గొడవకు కారణమైంది.
స్నేహితులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో నారాయణరావును రాంబాబు బలంగా తోశాడు. మద్యం మత్తులో ఉన్న నారాయణరావు విసురుగా వెనక్కు పడిపోయాడు. తల రోడ్డుకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. మద్దిలపాలేనికి చెందిన ఈ నలుగురు పెయింటింగ్ పనులు చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు.
ఈ నలుగురు సులభ్ కాంప్లెక్స్ దగ్గర అష్టా చమ్మా ఆట మొదలుపెట్టారు. అక్కడున్న కేర్ టెకర్ రామకృష్ణ.. ఇక్కడ ఆడొద్దని వారించి వెళ్ళిపొమ్మని చెప్పాడు. అక్కడ నుంచి వెళ్లి.. కాసేపటికి మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ వారిస్తే.. రామకృష్ణపై ఆ నలుగురు తిరగబడ్డారు. ఒకానొక సమయంలో ఆయనపై కూడా దాడికి ప్రయత్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa