ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 20న భారత జట్టు ప్రకటన

national |  Suryaa Desk  | Published : Thu, Aug 17, 2023, 02:24 PM

పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 2018 తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్‌, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa