అమరావతి: అసెంబ్లి వ్యూహ కమిటీ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో మంత్రులు, విప్లు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ప్రజలే ముందు (పీపుల్ ఫస్ట్) అనేది టీడీపీ నినాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు మాట్లాడారు. పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.2 చొప్పున వ్యాట్ భారం తగ్గించామన్నారు. వేల కోట్ల ఆర్థికలోటులో కూడా పెట్రో ధరల తగ్గింపు సాహసోపేతమన్నారు. ప్రజలకు రూ.1,100 కోట్ల ప్రయోజనం కలిగించామన్నారు. లీటర్కు రూ.2 చొప్పున వ్యాట్ భారం తగ్గింపు పేదలకు ఎంతో ఊరటనిచ్చిందన్నారు. ట్రాన్స్పోర్టు అసోసియేషన్ ప్రతినిధుల అభినందనలే నిదర్శనమన్నారు. కేంద్రంలో ఏ మాత్రం ఉదారం కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించాలని కేంద్రం చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య అపోహలు పెంచాలని చూశారన్నారన్నారు. రాజకీయంగా టీడీపీని ఒంటరిని చేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీను బలహీన పరచాలని కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఏకపక్షంగా పొత్తులేదని ప్రకటించారని, ఏపీలో వైసీపీతో అంటకాగుతున్నారని విమర్శించారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని కోరినవాళ్లే గైర్హాజరయ్యారన్నారు. కేంద్రం వైఫల్యాలపై జగన్ ఎప్పుడూ నోరుమెదపలేదన్నారు. ప్రజా వ్యతిరేక చర్యల వల్లే ఎన్డీయే నుంచి వైసీపీ వైదొలిగిందన్నారు. కర్ణాటకలో బీజేపీయేతర పార్టీలకు టీడీపీ మద్దతిచ్చిందని, వైసీపీ మాత్రం బీజేపీకు అనుకూలంగా ప్రచారం చేసిందన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని కేంద్రం ఎందుకు పూడ్చదు? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa