ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్‌ ధరలపై పరిష్కారం మా చేతుల్లో లేదు : కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 11, 2018, 10:11 AM

న్యూఢిల్లి :  పెట్రోల్‌ ధరలపై పరిష్కారం తమ చేతుల్లో లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఒపెక్‌ వల్లే పెట్రో ధరలు భగ్గుమంటున్నాయని కేంద్రం పేర్కొంది. పెట్రోను తాము ఏకపక్షంగా జిఎస్‌టి కిందకు తీసుకురాలేం కదా అంటూ కేంద్రం చేతులు దులుపుకొంది. పెట్రోల్‌ బంకులకు అతి తక్కువ ధరకే పెట్రోల్‌ లభిస్తోంది. అయితే పన్నులతో కలిపి తడిపి మోపెడవుతోంది. బంకులకు లీటర్‌ పెట్రోల్‌ 39.21 రూపాయిలకు లభిస్తుంటే, మిగిలిన 40–45 రూపాయిలు పన్నులుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. వ్యాట్‌ రూపేణా రాష్ట్రాలు, ఎక్సైజ్‌ రూపేణా కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై భారీ పన్నులు వసూలు చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వ్యాట్‌ ఈ కింది విధంగా ఉంది. పెట్రోల్‌పై తెలంగాణలో వ్యాట్‌ 33.31 శాతం, మహారాష్ట్రలో 38 -39 శాతం, ఎపిలో 35.77 శాతం, గోవాలో 16.66 శాతం, తమిళనాడులో 32.16 శాతం, కర్ణాటకలో 30.28 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 26.87 శాతం, ఒడిశాలో 24.62 శాతం, బెంగాల్‌, జార్ఖండ్‌లలో 25.5 శాతం చొప్పున వ్యాట్‌ విధిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa