రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్మెంట్ చేస్తే ఆ రికార్డులు క్షేత్రస్థాయికి తగ్గట్టుగా లేవు. అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయిన భూములకు హక్కులు కల్పించడం ద్వారా 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. రైతుల ప్రమేయం లేకుండా రెవిన్యూ యంత్రాంగం 20 సంవత్సరాలు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. నెల రోజుల్లో ఆంక్షలు తొలగిపోయేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు ముందుకు వేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa