తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ ప్రకటించింది. ఈ ఏడాది వేంకటేశ్వరుడికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవం ఏటా నిర్వహించేది. ఇక అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈసారి అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈసారి బ్రహ్మోత్సవాలకు కిందటిసారి కంటే మరింత ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు కొన్ని ప్రత్యేక సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు:
సెప్టెంబరు 18 - ధ్వజారోహణం
సెప్టెంబరు 22 - గరుడ వాహన సేవ
సెప్టెంబరు 23 - స్వర్ణ రథం
సెప్టెంబరు 25 - రథోత్సవం (మహారథం)
సెప్టెంబరు 26 - చక్రస్నానం, ధ్వజావరోహణం
నవరాత్రి బ్రహ్మోత్సవాలు:
అక్టోబరు 19 - గరుడవాహన సేవ
అక్టోబరు 22 - స్వర్ణరథం
అక్టోబరు 23 - చక్రస్నానం
రద్దైన సేవల వివరాలు:
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అష్టాదళ పాదపద్మారాధన, తిరుప్పావడై, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాలు జరుగనున్న సెప్టెంబరు 18 నుంచి 26, అక్టోబరు 15 నుంచి 23 మధ్య ఈ సేవలు అందుబాటులో ఉండవు. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను నిర్దేశిత వాహనసేవకు మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కారణంగా అక్టోబరు 14న సహస్రదీపాలంకార సేవను రద్దు చేసినట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa