అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఓటరు జాబితాలో జరిగిన అవకతవకల వ్యవహారంలో ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం జడ్పీ సీఈఓగా గతంలో పనిచేసి, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఈటీసీ(ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్) గెజిటెడ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్న శోభా స్వరూపరాణిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ ఈఆర్ఓ, అనంత జడ్పీ సీఈఓ భాస్కర్రెడ్డిని ఆదివారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇంతవరకు ఈసీ తనను వివరణ అడగలేదని, పైఅధికారులు కూడా ఎప్పుడూ విచారణ చేసిందే లేదని, ఈ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని శోభా స్వరూపరాణి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa