నంద్యాల జిల్లాలో పెండింగ్లో ఉన్న 132 రీ ఓపెన్ సర్వీసులకు సంబంధించి దరఖాస్తులన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలని, ఏ ఒక్క దరఖాస్తు కూడా బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న జగనన్నకు చెబుదాం - స్పందనలో స్వీకరించిన విజ్ఞప్తులపై సత్వర చర్యలు తీసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల ఈకేవైసీని రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన 1372 పనుల్లో 705 పనులు పురోగతిలో ఉన్నాయని, మిగిలిన పనులను వెంటనే గ్రౌండింగ్లోకి తీసుకురావాలని ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa